లాక్‌డౌన్‌లో గృహహింస.. ఫిర్యాదులకు వాట్స‌ప్‌ నెంబర్‌

విజయవాడ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై గృహహింస పెరుగుతోందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా మహిళలపై గృహహింస కేసులు పెరుగాయని జాతీయ మహిళా కమిషన్‌ కూడా తన నివేదికలో పేర్కొం‍ది. దీనితో పాటు లాక్‌డౌన్‌ సమయంలో సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.